-
కూతురు దువా ఫొటోతో అభిమానులకు శుభాకాంక్షలు
-
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో.. క్యూట్ గా ఉందంటున్న నెటిజన్లు
బాలీవుడ్ ప్రముఖ జంట దీపికా పదుకొణే, రణ్ వీర్ సింగ్ తమ గారాల కూతురు ‘దువా‘ను ప్రపంచానికి పరిచయం చేశారు. దీపావళి వేడుకల సందర్భంగా తొలిసారి తమ కూతురి ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీపావళి ఫొటోలతో పాటు కూతురు దువా ఫొటోను రివీల్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాప చాలా ముద్దుగా (క్యూట్గా) ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
గతేడాది సెప్టెంబర్ లో దీపిక, రణ్ వీర్ దంపతులకు కూతురు పుట్టింది. పాపకు దువా అని నామకరణం చేసినట్లు తెలిపిన ఈ జంట.. ఇప్పటి వరకూ కూతురిని మీడియాకు గానీ, సోషల్ మీడియాలో ఫొటోలను గానీ చూపించలేదు. ఇతర సెలబ్రిటీల మాదిరిగానే వీరు కూడా తమ బిడ్డ గోప్యతకు (ప్రైవసీకి) ప్రాధాన్యం ఇస్తూ “నో ఫొటో పాలసీ”ని అనుసరిస్తూ వచ్చారు.
ఒకానొక సందర్భంలో దీపిక తన కూతురుతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడు వీడియో తీసేందుకు ప్రయత్నించిన మీడియాపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తమ కూతురు ప్రైవసీని గౌరవించాలని కోరారు. అంతేకాదు, అప్పటి వరకు రికార్డు చేసిన వీడియోను తొలగించేలా సదరు మీడియా సిబ్బందిపై ఆగ్రహం చూపించారు. అయితే, ఇన్నాళ్లు తమ కూతురి ముఖాన్ని గోప్యంగా ఉంచిన దీపిక, రణ్వీర్ సింగ్ జంట దీపావళి పండుగ సందర్భంగా కూతురు దువాతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
Read also : AP : ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కొత్త సంస్కరణలు: సైన్స్ విద్యార్థులకు అర మార్కు సడలింపు
